అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థి (Engineering student) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. జిల్లాలోని వత్సవాయి మండలం కన్నెవీడు గ్రామానికి చెందిన బాణావతి ఆకాష్.. రావులపాలెం సమీపంలోని కన్యకా పరమేశ్వరి ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే కాలేజీ సమీపంలో ఉన్న కాలువలో అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు ఆకాశ్గా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.