అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. కొత్త పీఆర్సీని అమలు చేయవద్దని కోరుతూ పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు తమ ఆందోళనలకు మరింత పదును పెట్టారు. రేపటి నుంచి (శనివారం) నుంచి సహాయ నిరాకరణ చేపడుతామని ప్రకటించడం, రేపు సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే సచివాలయం లో పెన్డౌన్ నిర్వహించారు. అదే విధంగా యాప్ డౌన్ చేసి ఉద్యోగులు నిరసన తెలిపారు.
విశాఖ పట్నంలో ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. చలో విజయవాడ విజయవంతం కావడంతో పీఆర్సీ సాధన సమితి ఈరోజు సమావేశం కానున్నది. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మీడియా మరో అధికారి శశిభూషణ్ చేసినా వ్యాఖ్యలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.