తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఉన్న తిరుమలలో (Tirumala) ఏనుగుల సంచారం కలకలం రేపింది. ఆదివారం వేకువజామున పాపవినాశనం రోడ్డులో పార్వేట మండపం వద్ద ఏనుగులు గుంపు సంచరించాయి. రోడ్డు పక్కన డివైడర్లను, గోడలను ధ్వంసం చేశాయి. ఏనుగులను చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సంచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఇటీవల కాలంలో తిరుమలలో ఏనుగుల గుంపు తరచూ కనిపిస్తున్నది. మార్చి 29న కూడా పాపవినాశనం దారిలో రోడ్డుపై ఏనుగులు సంచరించాయి. దానికి రెండు రోజుల ముందు పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు కనిపించింది.