అమరావతి : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగులు హల్ చల్ చేశాయి.. ఇవాళ సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డుకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఒక్కసారిగా ఘాట్ రోడ్డుపై దర్శనమిచ్చాయి. ఏనుగుల ఘీంకారాలకు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఎలిఫెంట్ ఆర్చ్ కు సమీపంలో ఏనుగుల గుంపును చూసిన వాహన చోదకులు వాహనాల ఇంజెన్స్ నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.
విజిలెన్స్ సిబ్బంది వెంటనే…. అటవీ శాఖాధికారులకు సమాచారాన్ని అందించారు. అక్కడ చేరుకున్న అటవీ శాఖ అధికారులు భారీగా సైరన్ మోగించి ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలో పంపే ప్రయత్నం చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో మొదటి ఘాట్ రోడ్డులో రెండోసారి ఏనుగుల సంచారంతో భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.