Tirupati | ఏపీలోని తిరుపతి జిల్లాలో భూ ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. తిరుపతికి అతి సమీపంలోని దొరవారిసత్రం, నాయుడుపేట సహా పలు ప్రాంతాల్లో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇండ్లలోని వస్తువులు ఒక్కసారిగా కిందపడిపోయాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
శుక్రవారం రాత్రి 8 గంటల 43 నిమిషాలకు తిరుపతి సమీపంలో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ వెల్లడించింది. రిక్టర్స్కేలుపై 3.9 తీవ్రత నమోదైనట్లు తెలిపింది. భూకంప తీవ్రత స్వల్పంగా నమోదవ్వడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇదిలా ఉంటే.. అదే సమయంలో జపాన్ రాజధాని టోక్యోలను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6 తీవ్రత నమోదైంది.