అమరావతి : ఆర్థికబారంతో చేసిన అప్పులు చెల్లించలేక ఓ కుటుంబం ఆత్మహత్యయత్నానికి (Family Suicide Attempt ) ఒడిగట్టింది. ఏపీలోని నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కావలిలో కారు డ్రైవర్గా పనిచేస్తున్న భాస్కర్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబాన్ని పోషించేందుకు అప్పులు (Debt) చేయడంతో ఆర్థికబారం ఎక్కువై వాటిని చెల్లించలేని స్థితికి చేరుకున్నాడు.
దీంతో రాత్రి ఇంటిలో బిర్యానీలో విషగూళికలు కలిపిన అన్నం కుటుంబ సభ్యులకు తినిపించి తానూ తిన్నాడు. వీరందరికీ వాంతులు కావడంతో స్థానికులు వెంటనే కావలి ఆస్పత్రికి (Kavali Hospital) సకాలంలో చేర్పించి చికిత్స అందజేశారు. కుమారుడు అవినాష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.