అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలోని కుప్పం మున్సిపల్ చైర్మన్గా వైఎస్సార్సీపీకి చెందిన డాక్టర్ సుధీర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ చైర్మన్గా అఫీస్, మునిస్వామిల చేత ప్రత్యేకాధికారి ప్రమాణం చేయించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన 12 మున్సిపాల్టీలు, నెల్లూరు కార్పొరేషన్కు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటిలో ప్రకాశం జిల్లా దర్శి, కృష్ణా జిల్లా కొండపల్లిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు గెలుపొందగా మరో 11చోట్ల వైసీపీ నాయకులు విజయం సాధించారు.
కుప్పం (చిత్తూరు జిల్లా), అకివీడు (పశ్చిమ గోదావరి జిల్లా), జగ్గయ్యపేట, బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (వైఎస్సార్), , దాచేపల్లి, గురజాల (గుంటూరు), పెనుకొండ (అనంతపురం), మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికైన సభ్యులు సోమవారం సమావేశమై చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్లను ఎన్నుకుంటున్నారు. కాగా టీడీపీ వశమైన కొండపల్లిలో ఎన్నిక రేపటికి వాయిదా పడింది.