Botsa Satyanarayana | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏనాడైనా తాను గానీ.. తన పార్టీ నేతలు గానీ తప్పు చేశామని భావిస్తే తమకు ఓటు వేయొద్దని బొత్స ప్రజలకు సూచించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏ తప్పు చేయకుండా నిజాయతీతో రాజకీయాలు చేశామన్న ధైర్యం తమకు ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు. అందుకే తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని తెలిపారు. తన సతీమణి ఝాన్సీని రెండుసార్లు, రవిబాబును ఒకసారి ఎంపీగా గెలిపించారని అన్నారు. ఇప్పుడు నాలుగోసారి మళ్లీ మీ ముందుకు వస్తున్నానని తెలిపారు. ఈసారి కూడా భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నానని తెలిపారు.