అమరావతి : అధికారం కోసం తోడేళ్ల ముఠా ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. టీడీపీ, జనసేన మాయమాటలను నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతపుం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాడి, పంటలు ఇచ్చే నాయకత్వం కావాలా నక్కలు, తోడేళ్ల రాజ్యం కావాలా ప్రజలు తేల్చుకోవాలని కోరారు.
పేదల ప్రభుత్వం కావాలా పెత్తందారుల ప్రభుత్వం కావాలా ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. ప్రజలకు మేలు చేసేందుకు చంద్రబాబు(Chandra Babu) ఏనాడు మంచి నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. ఆయనకు నైతికత అనేది అసలుకే లేదని విమర్శించారు. గత పాలనలో రైతులను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో టీడీపీ నాయకుల జేబులు నింపారని తెలిపారు. రైతులకు అరకొరగా బీమా డబ్బులు చెల్లించారని ఆరోపించారు.