అమరావతి : తిరుమలలోని కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామికి భారీ విరాళాలు అందుతున్నాయి. టీవీఎస్ మోటార్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ శనివారం స్వామివారికి కోటీ 5లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు.ఈ విరాళం శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్కు అందజేయాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డికి డీడీని అందజేశారు.
అదేవిధంగా హైదరాబాద్కు చెందిన జీవీఏ ఇన్ఫ్రా సంస్థ శ్రీ బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని పథకానికి రూ. కోటీ 26వేలను అందజేశారు. హరిబాబు, S వెంకటేశ్వరులు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు రూ. 10 లక్షలు, S రవిబాబు రూ. ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్కు రూ. 2 లక్షల 50 వేలు డోనర్ సెల్లో అందజేశారు.