తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది హ్యాండిక్యాప్డ్(బర్డ్) సంస్థకు ఓ భక్తుడు రూ.11 లక్షల విరాళం(Donation) అందజేశారు. సంస్థ తరపున వారి ప్రతినిధి తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర గురువారం విరాళపు డిడిని టీటీడీ(TTD) జేఈవో సదా భార్గవికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె దాతకు కృతజ్ఞతలు తెలిపారు.
తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 12 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 65,991 మంది భక్తులు దర్శించుకోగా 21,959 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.57 కోట్లు వచ్చిందన్నారు.