అమరావతి: ఒమిక్రాన్ వైరంట్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో కొన్ని గంటలు ఓ వార్త సంచలనం కలిగించింది. సుమారు 30 మంది ప్రయాణికులు విదేశాల నుంచి ఏపీకి వచ్చి మిస్సయ్యారన్న వార్తను ఏపీ ఉన్నతాధికారులు ఖండించారు. శనివారం అమరావతిలో ఏపీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ హైమావతి స్పందించి వాస్తవాలను వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన 30 మంది ప్రయాణికులు మిస్సయ్యారనే వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
వచ్చిన ప్రయాణికులు వైజాగ్, సమీప జిల్లాలకు చెందిన 30 మంది అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను కేంద్రం తమకు పంపించిందని తెలిపారు. వచ్చిన ప్రయాణికులు వారివారి ఇళ్లల్లో ఐసోలేషన్లో ఉండేలా వైద్య బృందాలు అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇలాంటి వదంతుల్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెంద వద్దని సూచించారు. ఏపీలో విదేశీ ప్రయాణికులు దిగడానికి ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవన్నారు.