తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరి శ్రీవారి దర్శనం అయ్యేందుకు దాదాపు 10 గంటల సమయం పడుతుందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు చెప్తున్నారు. రూ.300 లు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2,3 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. కాగా, ఆదివారం, సోమవారం భక్తులు పలుచగా ఉండగా.. మంగళవారం భక్తుల సంఖ్య విశేషంగా పెరిగిపోయింది.
నిన్న తిరుమల శ్రీవారిని 67,843 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,817 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.88 కోట్లుగా ఉన్నదని టీటీడీ బోర్డు అధికారులు తెలిపారు.