అమరావతి : పలు ఆరోపణలతో డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ప్రకాశ్ అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పపై ఫిర్యాదు చేశారు. ఇవాళ అనంతపురంలో డీఐజీ రవిప్రకాశ్ను కలిసి ఫిర్యాదు సమర్పించారు. ఎస్పీ ఫకీరప్ప నుంచి తనక ప్రాణహాన ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించాలని డీఐజీని కోరాడు. ఏఎస్పీ, డీఎస్పీల నుంచి కూడా సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయాడు.
ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటించిన సందర్భంగా పోలీసులకు రావాల్సిన బాకాయిలపై కానిస్టేబుల్ ప్రకాశ్ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. దీంతో ఆగ్రహించిన పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి శాఖపరమైన చర్యల్లో భాగంగా అతడిని విధుల నుంచి డిస్మిస్ చేశారు. దీంతో ఆయన జిల్లా ఎస్పీ ఫకీరప్పతో పాటు మరికొంత మందిపై ఎన్హెచ్ఆర్సీకి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎస్సీ అయినందువల్లే తనను డిస్మస్ చేశారని, ఎస్పీపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు.