అమరావతి : కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్రతీరంలో ఇద్దరు యువకులు గల్లంతైన విషాద ఘటన చోటు చేసుకుంది . వినాయక నిమజ్జనానికి వచ్చిన ఆరుగురు యువకులు వినాయక ప్రతిమను సముద్రంలో విసర్జిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయారు. మత్స్యకారులు వెంటనే గమనించి నలుగురిని కాపాడగా ఇద్దరు గల్లంతు అయ్యారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.