అమరావతి : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల డయేరియా ( Diarrhea ) ప్రబలిందని పేర్కొంటూ శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవల శ్రీకాకుళం పట్టణ ప్రాంతాలయిన కాకివీధి, గోల్కోండ రేవు, దమ్మలవీధి, మంగువారితోట ప్రాంతాల్లో డయేరియా సోకి ఒకరు చనిపోగా మరో 76 మంది ఆసుపత్రి పాలయ్యారు.
విధుల్లో కమిషనర్ కూర్మారావు నిర్లక్ష్యంగా వ్యహరించారంటూ ప్రభుత్వ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్కుమార్ సస్పెండ్ ( Suspension) ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా వార్డులల్లో ఇంటింటా సర్వే నిర్వహించి వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారికి చికిత్స అందిస్తోంది.