శ్రీశైలం మహాక్షేత్రానికి వస్తున్న యాత్రికుల ఇబ్బందులను నేరుగా తెలుసుకునేందుకు డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ కమీషనర్ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు భక్తులు నేరుగా దేవస్తాన కార్యనిర్వాహణాధికారితో మట్లాడేందుకు వీలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉభయ తెలుగు రాష్ర్టాల యాత్రికులే కాకుండా దేశం నలుమూలల నుండి జ్యోతిర్లింగ శక్తిపీఠాన్ని దర్శించుకునేందుకు వస్తున్న వారికి అవసరమైన వసతి ఏర్పాట్లు, ఆర్జితసేవా టిక్కెట్ల కేటాయింపు, దర్శన విధానాలు, అన్నప్రసాద వితరణ, ప్రసాదాలు, పబ్లికేషన్స్ విభాగాల సేవల వల్ల భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని సత్వర పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి బుధవారం యాత్రికులు 08524 – 28711 నంబరుకు ఫోన్ చేసి సలహాలు సూచనలు అందించాలని ఈవో లవన్న కోరారు.