శ్రీశైలం : భక్తుల సౌకర్యార్థం బుధవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తామని, భక్తులు 08524 287111 నంబర్కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈవో పేర్కొన్నారు.
వసతి, దర్శనం, అన్న ప్రసాద వితరణ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నామని, ముఖ్యంగా స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా పారిశుధ్యంపై సైతం దృష్టి పెట్టామన్నారు. క్షేత్రం సుందరీకరణ పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయన్నారు. భక్తులు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో క్షేత్ర అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. సమావేశం అనంతరం అన్ని విభాగాల అధికారులు, పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు.