తిరుమల : తిరుమలలో ప్రతి శనివారం నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని ఈనెల 10న నిర్వ హిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో టీటీఈ ఈవో ఎవి ధర్మారెడ్డికి ఫొన్ ద్వారా నేరుగా మాట్లాడవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని వేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు. భక్తులు తమ సందేహాలను, సూచనలను నెంబరు 0877-2263261కు ఫొన్ చేసి ఈవోకు తెలుపవచ్చని వివరించారు.
కాగా నిన్న శ్రీవారిని 69,115 మంది భకులు దర్శించుకోగా 31,762 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.93 కోట్లు వచ్చిందని వివరించారు. 25 కంపార్టు మెంట్లలో భక్తులు దర్శనానికి వేచియున్నారని వీరికి 10 గంటల్లో దర్శనం కలుగుతుందని వెల్లడించారు.