అమరావతి : ఎగువ భాగాన కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి నది ( Godavari Flood) కి వరద ప్రవాహం తగ్గింది. వచ్చిన వరద నీటితో ధవళేశ్వరం (Davaleshwaram) కాటన్ బ్యారేజ్ వద్ద 11.5 అడుగుల వరకు నీటిమట్టం చేరుకుంది. అధికారులు ముందస్తుగా 11 వేల క్యూసెక్కుల నీరు డెల్టా పంట కాల్వలకు, సముద్రంలోకి 9.58 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ 9Prakasam Barage) కు వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతం నుంచి 17,344 క్యూసెక్కుల నీరు వస్తుండగా 14 గేట్లను అడుగు మేర ఎత్తి 5.416 క్యూసెక్కుల నీటిని కాల్వలకు విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 10.290 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.