అమరావతి : ఏపీలో జరుగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మానిదే విజయం.. పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠమని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం( Prajagalam) బహిరంగ సభలో పవన్కల్యాణ్ ఆవేశంగా మాట్లాడారు.
ఏపీలో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి మోదీ పాంచజన్యను పూరిస్తారని అన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టాన్ని చేసిన అభివృద్ధి లేక, అప్పుల బాధతో నలుగుతున్న ఏపీ విముక్తి కోసం ఎన్డీయే(NDA) కలయిక 5 కోట్ల మంది ప్రజలకు ఆనందం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మోదీ(Modi) ప్రభుత్వం హ్యట్రిక్ కొట్టబోతున్నామని పేర్కొన్నారు. 2014లో తిరుపతిలో వెంకన్న సాక్షిగా, 2024 విజయవాడ కనకదుర్గ సాక్షి పొత్తుగా పెట్టుకుని ఎన్డీయే కూటమి రాష్ట్రంలో ఘన విజయం సాధించబోతుందని పేర్కొన్నారు.
దేశాన్ని డిజిటల్ విధానాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఏపీలో నగదు బదిలీ అదేవిధంగా కొనసాగుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం లిక్కర్, ఇసుక మాఫియా, భూ మాఫియా తో రాష్ట్రాన్ని దివాళా తీశారని వెల్లడించారు. శాంతి భద్రతలు కరువయ్యాయనిచ ఏపీ గంజాయి కేంద్రంగా మారిందని, పరిశ్రమలు తరలిపోయాయని అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం వైఎస్ వివేకానందను వైసీపీ మర్డర్ చేసిందని పేర్కొన్నారు.