తిరుమల : తిరుమల కొండపై ఉన్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన మెట్లమార్గాన (Stairs) వచ్చే భక్తులకు టీటీడీ (TTD Instructions ) పలు సూచనలు చేసింది. ముఖ్యంగా పలు ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వృద్ధులు, అధిక రక్తపోటు, మధుమేహం (Diabetes) , కీళ్లవ్యాధులు, మూర్ఛ, గుండె సంబంధిత (Heart diseases) వ్యాధులున్నవారు మెట్లమార్గాన రావడం శ్రేయస్కరం కాదని వెల్లడించింది.
తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని వివరించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజు వారి మందులు వెంట తెచ్చుకోవాలని అన్నారు.
కాలినడకన ఏవైనా సమస్యలు ఎదురవుతే 1500 మెట్టు, గాలిగోపురం, భాస్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చని తెలిపారు. తిరుమలలోని ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.