తిరుమల : తిరుమలలోని ఏడుకొండలస్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. శనివారం స్వామివారిని 87,698 మంది భక్తులు దర్శించుకోగా 48,804 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3. 88 హుండీకి ఆదాయం వచ్చిందని తెలిపారు.
కాగా నేటి నుంచి శ్రీవారి ఆలయంలో జేష్టాభిషేకం ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. కరోనా తరువాత రెండేళ్లకు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరెంట్ బుకింగ్లో భక్తులకు జేష్టాభిషేకాల టికెట్లను విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.