శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. పరమ శివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుండే కాక ఉత్తర దక్షిణాది యాత్రికులు ఆదివారం సాయంత్రానికి అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. భక్తులకు అలంకార దర్శనాలు కల్పించడంలో ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో లవన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
తెల్లవారుజుమున కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేసుకుని కృష్ణమ్మకు పసుపు కుంకుమ సారెలు ఇచ్చి కార్తీక దీప దానాలు చేశారు. స్నానాల ఘాట్ వద్ద ప్రమాదాలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి తెలిపారు. చిన్నారుల పట్ల తల్లిదండ్రులు శ్రధ్ద వహించాలని ఆయన కోరారు.
అదే విధంగా కార్తీక దీపాలను వెలిగించుకునేందుకు భక్తులకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయని ఆలయ ఏఈఓ హరిదాసు తెలిపారు. విద్యుద్దీప కాంతులతో అలరారుతున్న ఆలయ శోభను వీక్షిసూ భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులవుతున్నారు.
వాహనదారులు సహకరించాలి – ఇన్స్పెక్టర్ రమణ
శ్రీశైలం వచ్చి వెళ్లే యాత్రికులు సాక్షి గణపతి ఆలయం వద్ద రోడ్డుకు ఇరువైపులా వాహనాలను అడ్డంగా నిలిపివేసి ఆలయ దర్శనానికి వెళ్లిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్నాయి. యాత్రికులు తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగించకుండా సహకరించాలని పోలీస్ ఇన్స్పెక్టర్ రమణ కోరారు. ఆదివారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు సుమారు ఆరు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను అదుపు చేశారు.
పుష్కరిణికి దశవిధ హురతులు..
స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు శాస్ర్తోక్త పూజలానంతరం పుష్కరిణి వద్దకు వేంచేబు చేయించి ప్రత్యేక పుప్పాలంకరణ లక్ష దీపార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. కార్తీక మాసంలో పూష్కరిణి వద్ద మహిళలు దీపాలు వెలిగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మాసంలో ప్రతి సోమవారం పుష్కరిణి హారతి అత్యంత వైభవంగా జరుగుతుందని అన్నారు. ప్రత్యేక ఆకర్షణగా చేసే దశవిద హారతులను చూసేందుకు తెలంగాణ ప్రాంతాల వారు ఎక్కువగా ఆసక్తి చూపుతారని శ్రీశైలప్రభ సంపాదకుడు డాక్టర్ అనీల్ కుమార్ తెలిపారు.
దశవిధ హారతుల దర్శన ఫలం..