తిరుమల : తిరుమలలో (Turumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వారాంతపు సెలువు దినం కావడంతో శని, ఆదివారాల్లో భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 15 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు . నిన్న స్వామివారిని 75,147 మంది భక్తులు దర్శించుకోగా 28,096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3.16 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.