తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 18 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ని
న్న స్వామివారిని 57,147 మంది దర్శించుకోగా 26,094 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.78 వచ్చిందని తెలిపారు.
రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై సమీక్ష
ఆదివారం జరగనున్న రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై తిరుమల వీజీవోబాలిరెడ్డి, తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాపవినాశనం వద్ద పార్కింగ్ సమస్య దృష్ట్యా భక్తుల రద్దీకి సరిపడా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తిరుమల ఆర్టీసీ డిపో మేనేజర్ తెలిపారు.
గతంలో మాదిరిగా ప్రైవేటు టాక్సీ డ్రైవర్లు , భక్తులు టీటీడీకి సహకరించాలని కోరారు. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సంబంధిత అధికారులు ఆహారం, తాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ అధికారులు వివరించారు.