అమరావతి : ఏపీలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. విశాఖ నుంచి కిరండోల్కు వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఒక బోగి అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో పట్టాలు తప్పింది. అప్రమత్తమైన డ్రైవర్ రైలు ను వెంటనే నిలిపివేసి అధికారులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న సాంకేతిక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.
చలికాలం దృష్ట్యా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. పండుగలకు సెలవుల కారణంగా విశాఖ, అరకులోయకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ తరుణంలో ప్రమాదం చోటు చేసుకోవడం, ప్రయాణికులు ముప్పు నుంచి తప్పించుకోవడం పట్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.