అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు తిరుమలలో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాలను ఢిల్లీ నుంచి వచ్చిన ఐఐటీ బృందం సభ్యులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఐఐటీ నిపుణుడు కేఎస్ రావు మాట్లాడుతూ..వర్షం కారణంగా కొండ చరియల నుంచి 40-50 టన్నులు బరువు ఉన్న బండరాళ్లు జారిపడ్డాయని తెలిపారు. బండరాళ్లు పడడంతోనే రోడ్లు ధ్వంసమయ్యాయని, ఘాట్ రోడ్డు పటిష్టంగానే ఉందని పేర్కొన్నారు.
ఈ సమస్యను 2, 3 నెలల్లో పరిష్కారమని వెల్లడించారు. మరో 12 ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రస్తుతమున్న ఘాట్రోడ్లకు ప్రత్యామ్నాయంగా మరో రోడ్డు నిర్మాణం చేయాలని సూచిస్తామన్నారు.