అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సీపీఎస్ ఉద్యోగుల డిమాండ్ పరిష్కరానికి ప్రభుత్వం మరో రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటుందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఇవాళ ప్రభు త్వ ఉద్యోగుల సంఘం మహాసభల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆమోద యోగ్యంగా ఉంటుందని , ఉద్యోగుల క్రమబద్దీకరణ ఈ ఏడాది ఆఖరికల్లా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
వైసీపీ పార్టీ ఇచ్చిన వంద హామీల్లో సీపీఎస్ రద్దు ఒకటని, సీపీఎస్పై ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. చర్చల ద్వారానే ఉద్యోగుల సమస్యలకు పరిష్కా రం లభిస్తుందన్నారు. సీపీఎస్ కంటే మెరుగైన పరిష్కారం చూపాలని సీఎం స్పష్టం చేశారని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు వచ్చే నెల నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించనున్నామని వెల్లడించారు. వచ్చే మూడు నెలల్లో విద్య, వైద్యశాఖలో ప్రమోషన్లు ఉంటాయని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములేనని తెలిపారు.