అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో పరిపాలన వికేంద్రీక రణకు ప్రభుత్వం సిద్ధమవుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విశాఖపట్నంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కావొద్దని, శ్రీబాగ్ ఒప్పందం మేరకే కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా పరిపాల న రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని చెప్పారు.
ఇప్పటికి అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.రాష్ట్రంలోని 26 జిల్లాలు సమానమే నని, 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టిం చడం సరికాదని వెల్లడించారు. రౌండ్ టేబుల్ సమావేశం లో కొందరు అమరావతి రైతుల యాత్రను తరమికొట్టాలంటూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీరియస్ అయ్యా రు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని , శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఎవరూ వ్యవహరించ కూడదని సూచించారు.