AP News | అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 14 నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 25న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తం 11 రోజుల పాటు స్కూళ్లకు దసరా సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది.