తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి 18 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న 72,540 మంది భక్తులు స్వామిని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా 33,339 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.91 కోట్లు వచ్చిందని తెలిపారు.