తిరుమల : తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆపదమొక్కులవాడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు గల భక్తులకు నేరుగా దర్శనం అవుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) అవుతుందని వివరించారు. నిన్న స్వామివారిని 64,525 మంది భక్తులు దర్శించుకోగా 19,880 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.53 ఆదాయం వచ్చిందన్నారు.