తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలువు దినాలు కావడంతో శని, ఆదివారం శ్రీవారి సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో కంపార్టుమెంట్లు (Compartments) భక్తులతో నిండిపోయి దర్శనం కోసం ఏటీసీ వరకు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(TTD)అధికారులు తెలిపారు.
నిన్న స్వామివారిని 74,351 మంది భక్తులు దర్శించుకోగా 34, 164 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.04 కోట్లు వచ్చిందని వివరించారు.
మార్చి 20 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అధికారులు వివరించారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 20న సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారని తెలిపారు.
రెండవ రోజు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు మార్చి 22న భూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు శ్రీమలయప్పస్వామివారు 23న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 24న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు.