తిరుమల : వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో బాలాజీ సన్నిధి కిటికిటలాడుతుంది. సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
భక్తులు కృష్ణతేజ అతిథిగృహం వరకు క్యూలో నిలబడియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) లభిస్తుందని టీటీడీ (Ttd) అధికారులు వివరించారు. నిన్న 62,649 మంది భక్తులు దర్శంచుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ.3.74 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.