తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 63,670 మంది భక్తులుదర్శించుకోగా 30,475 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.79 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.