అమరావతి : ఏపీలోని రెండు జిల్లాలో జరిగిన కరెంట్ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం జానకిరామపురంలో వాటర్ హీటర్ షాక్ కొట్టి తల్లి అనూష, కుమార్తె ధన్విక మృతి చెందారు. మంగళవారం స్నానానికి నీళ్లను కాచేందుకు హీటర్ (Waterr Heater) ను పెట్టగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందారు. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలంలో చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
విజయనగరం జిల్లాలో జరిగిన బాడంగి మండలం పూడివలసలో ఇద్దరు ఉపాధిహామీ కూలీలు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో అప్పలనాయుడు(60), రామ్మూర్తి (55) అనే కూలీలు మృతి చెందారు.