అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నేరాల సంఖ్య చాలా మట్టుకు తగ్గుముఖం పట్టాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంతో పోల్చుకుంటే ప్రసుత్తం ఏపీలో నేరాలు తగ్గడంతో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని అన్నారు. ఆదివారం విశాఖలో పలు ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సమాజంలో నేరాలు జరుగుతూనే ఉంటాయని,ఏపీలో వందశాతం నేరాలు తగ్గాయని అనడం లేదని పేర్కొన్నారు.
మహిళా కమిషన్ చంద్రబాబుకు నోటీస్ ఇవ్వడంపై ఆయన స్పందించారు. బాబుకు నోటీసు ఇవ్వడం తప్పయితే తప్పు ఒప్పులు న్యాయస్థానం తేలుస్తుందని చెప్పారు. ఒంగోలులో సీఎం కాన్వాయ్ వాహనం కోసం కారును లాక్కొన్న విషయంలో ఒకరిద్దరు అధికారుల తప్పిదమైతే సమాజం మొత్తం తప్పని భావించడం తగదని సూచించారు.