అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై సీపీఎం నాయకులు ఈరోజు విజయవాడలో ఒకరోజు నిరాహార దీక్షను నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో పార్టీ నేతలతో కలిసి దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు అమరావతి రైతు నాయకులు మద్దతు పలికారు. శ్రీనివాస రావు మాట్లాడుతూ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని కోరారు. నిన్న ప్రధాని మోదీ తెలుగువారిని అవమాన పరిచే విధంగా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమరావతి రైతులు, కూలీలకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాజధాని అభివృద్ధి కోసం నిధులను విడుదల చేయకుండా అన్యాయం చేస్తుంటే ఏపీ సీఎం కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని నాయకులు పువ్వాడ సుధాకర్ ప్రశ్నించారు.