అమరావతి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను వ్యతిరేకిస్తూ విశాఖ కలెక్టరేట్ ఎదుట వామపక్షాలు ధర్నాను నిర్వహించాయి. పెంచిన గ్యాస్, డీజిల్, సిలిండర్ల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇంటిపన్ను, విద్యుత్, చెత్త పన్ను తదితర పన్నులను పెంచి ప్రజలపై పలు భారాలు మోపాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పెంచిన పన్నులు, ధరలు తగ్గించేంత వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
8 ఏళ్ల పాలనలో దేశం సిగ్గుపడే ఏ ఒక్క పని చేయలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శించారు. బీజేపీ పాలనలో ప్రజా, నిరుద్యోగ, రైతు సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని మండిపడ్డారు. మోదీ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజలపై పన్నులు పెంచినందుకా? ధరలు పెంచినందుకా? పక్క రాష్ట్రాల కంటే అధనంగా పన్నులు వేసిందుకా అని నిలదీశారు. కర్నూలు, ఏలూరు తదితర జిల్లా కలెక్టర్ల ఎదుట నిరసనలు చేపట్టాయి.