అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీ మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఇంటిలోనే ఐసోలేషన్లో ఉంటూ ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అవంతి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో బుధవారం 340 కరోనా కేసులను గుర్తించగా అంతకు ముందు రోజు 298 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు తేడాలోనే 42 కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశమని వైద్యులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.