అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. గత 24 గంటల్లో ఏపీలో 434 కొత్త కేసులు నమోదయ్యాయి. 500 కేసులకు తక్కువగా నమోదవ్వడం చాలా రోజుల తర్వాత ఇదే తొలిసారి. ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 23,13,212 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తన తాజా నివేదికలో పేర్కొన్నది. వీరిలో 14,697 మంది మరణించారు.
కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,83,788 గా ఉంది. కాగా, ప్రస్తుతం 14,726 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాల్టి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,28,46,978 నమూనాలను పరీక్షించారు. గత 24 గంటలల్ో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 108 కేసులు వచ్చాయి. పరీక్షల సంఖ్య తక్కువగా ఉండటం కూడా కేసులు తగ్గడానికి కారణమని చెప్తున్నారు. ఇవాళ 15,193 మంది శాంపిల్స్ మాత్రమే పరీక్షించారు.