అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక పొత్తులతో వస్తున్నారని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati) ఆరోపించారు. బాపట్ల జిల్లా అద్దంకి మేదరమెట్లలో ఆదివారం వైసీపీ సిద్ధం చివరి సభలో ఆయన మాట్లాడారు. 14 ఏండ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఒక్క మేలు చేయలేరని విమర్శించారు. మూడు పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వస్తే ఎన్నికల్లో సముద్రంలో విసిరి సముద్రంలో ముంచేస్తామని పేర్కొన్నారు.
ఎంతమందితో కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయమని అన్నారు. . టీడీపీ నిర్వహిస్తున్న ‘ రా.. కదలిరా’ కార్యక్రమానికి ఎవరూ రావడం లేదని వెల్లడించారు. ఇచ్చిన ప్రతి మాటను వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. కుటమి నిర్వహిస్తున్నది జెండా సభ కాదు.. జెండా ఎత్తేసే సభ అని వ్యాఖ్యనించారు. పవన్ సీఎం కావాలని కాపులు భావించగా చంద్రబాబు ప్లాన్ చేసి ఎంపీగా పోటీకి పంపిస్తున్నారని ఆరోపించారు.