అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని దొరవారిసత్రం మండలం నెలబల్లి జాతీయ రహదారి వద్ద లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న దంపతులు మునస్వామి, సునీత అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.