అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి(YCP Government) కౌంట్ డౌన్ ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandra Babu) అన్నారు. మరో 52 రోజుల తర్వాత టీడీపీ(TDP) , జనసేన (Janasena) ప్రభుత్వం వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డారని పేర్కొన్నారు.
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు నిర్వహించిన ‘ రా కదలి .. రా’ బహిరంగ సభలో బాబు మాట్లాడారు. రాజకీయాలను కలుషితం చేసి వ్యక్తి జగన్ చిల్లర రాజకీయాలు మానుకుని గౌరవంగా రాజకీయాలు చేయడం నేర్చుకో సూచించారు. ఆర్టీసీ బస్సు(RTC Bus) ల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సంపద సృష్టించి ఏపీ ప్రజలకు బంగారు భవిష్యత్ను అందిస్తానని అన్నారు.
జాబ్ క్యాలెండర్(Job Calenders) ను ప్రకటించి నియమకాలను చేపడుతామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించేంతవరకు మూడువేల రూపాయలు అందిస్తానని అన్నారు. నాకు విజన్, జగన్కు జైలుకు( ప్రిజనరీ) పోవడం తెలుసని వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు. రాజకీయ రౌడీలకు ఖబడ్దారంటూ హెచ్చరించారు. వాలంటీర్ల వ్యక్తులకు వ్యతిరేకం కాదు. ప్రజలకు సేవ చేస్తే అభినందిస్తా .కాని జగన్కు సేవలందిస్తే సహించబోమని అన్నారు.