అమరావతి : కర్నూలు జిల్లాలో పత్తి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు యూ-బళ్లారి, రాయచోటి వంటి ఏడు జిల్లాలకు ప్రధాన కేంద్రమైన ఆదోని పత్తి మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి ధరలు పెరిగాయి. ఒక్క క్వింటాకు పత్తి ధర రూ. 10,759 పలికింది. సీజన్ ముగియడంతోపాటు సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడం వల్ల వ్యాపారుల మధ్య పోటీతో పత్తి ధరలు పెరిగాయి. పత్తి ధర పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సీజన్లో పత్తి దిగుబడి బాగా తగ్గడంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడి పత్తి ధరలు పెరిగి ఆదోని మార్కెట్లో రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారులు పత్తిని అధిక ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు.