ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కేవలం 244 కరోనా కేసులు మాత్రమే వెలుగు చూశాయి. మొత్తం 18,083 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు.
అదే సమయంలో చిత్తూరు జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. గడిచిన 24 గంటల్లో 662 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,30,10,692 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన రెండు మరణాలతో రాష్ట్రంలోని కరోనా మరణాల సంఖ్య 14,716కు చేరింది.
కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,296,535గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,565 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. నిబంధనలు తప్పకుండా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం థర్డ్వేవ్ ముగింపు దశలో ఉంది.