అమరావతి : తెలుగుదేశం పార్టీకి చెందిన వంగవీటి రాధాకు కరోనా స్వల్ప లక్షణాలు ఉండడంతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. ఆయన కూడా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 28 మందికి ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 1831 మంది కరోనా బారిన పడ్డారని అధికారులు వెల్లడించారు.