అమరావతి: ఆంద్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. దీంతో సామాన్యులేకాకుండా పలువురు రాజకీయ నేతలకు కరోనా సోకింది. ప్రకాశం జిల్లాలోని పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా రావడంతో హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అంతేకాకుండా మంత్రి బాలినేని భార్యకు కరోనా సోకడంతో ఆమెతో పాటు మంత్రి కూడా హోం ఐసోలేషన్లోనే ఉన్నారు. అటు మంత్రి అవంతి, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాద్, అంబటి రాంబాబు ఇటీవలే కరోనా బారిన పడ్డారు. గతంలో మంత్రి నాని, వంగవీటి రాధలకు కరోనా సోకిన విషయం తెలిసిందే..