అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది. కొత్తగా 3,396 మందికి కరోనా సోకింది. కరోనా బారిన పడి 9 మంది చనిపోయారని ఏపీ వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 78,746 యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం, వైద్య శాఖ సిబ్బంది అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. మరికొన్ని రోజుల పాటు ప్రజలు జాగ్రత్తా చర్యలు తీసుకోవాలని సూచించారు.